ప్రజలకు ఇబ్బ్ంది లేకుండా ట్రాఫిక్ విధులు నిర్వహించాలి
సంచలన వ్యాఖ్యలు చేసిన నూతన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ : ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదాలు, అలాగే వాహన రాకపోకలను సుదీర్ఘకాలం పాటు నిలిపి వేయడంతో వాహనదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని, ఇలాంటి ఘటనలను నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని డీజీపీ పేర్కొన్నారు. వేగ నియంత్రణ, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన నొక్కి చెప్పారు. ట్రాఫిక్ అధికారులతో మాట్లాడి, వాహన రాకపోకల కోసం ట్రాఫిక్ను ఎక్కువసేపు నిలిపి వేయవద్దని, పౌరులకు ఇబ్బందులు కలిగించవద్దని వారికి సూచించాలని ఆయన డీజీపీని ఆదేశించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాహనదారులకు, సాధారణ ప్రజలకు కనీస అసౌకర్యం కలిగేలా చూసుకుంటూ, తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని డీజీపీ పోలీసు అధికారులను ఆదేశించారు.
తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)లతో డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం సందర్భంగా, నగరంలో నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులపై డీజీపీ సమగ్ర సమీక్ష చేపట్టారు. సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం వివిధ శాఖల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.క్రమంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా చురుకైన వ్యూహాలను అవలంబించాలని, అవసరమైన చోట కఠిన నియంత్రణ చర్యలు అమలు చేయాలన సూచించారు. ఈ సందర్భంగా, రహదారి భద్రతా యంత్రాంగాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిర్వహణ మరియు రహదారి భద్రతా బ్యూరోను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉందని డీజీపీ ప్రకటించారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, ఈ బ్యూరో త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
