Kishan Reddy : బీఆర్ఎస్ కి ఓటేస్తే మీ ఓటు మూసినదిలో వేసినట్టే అంటున్న కేంద్ర మంత్రి

ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ అని కొనియాడారు....

Kishan Reddy : బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేస్తే మూసి నదిలో వేసినట్లే అవుతుందని కేంద్ర మంత్రి, ఎంపీ కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ సభలో అన్నారు. శనివారం గుడిమల్కాపూర్‌ నుంచి మెహిదీపట్నం, పద్మనాఖనగర్‌ వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్రమోడీని మూడోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Kishan Reddy Slams

ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ అని కొనియాడారు. మనమందరం ఐక్యంగా ఉండి నాంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ కేంద్ర జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అన్నపురం రమేశ్‌కుమార్‌, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాహుల్‌ చంద్ర, జిల్లా అధ్యక్షులు ముఖేష్‌, జనార్థనరావు, విజయ్‌, బీజేపీ నేత దేవర పాల్గొన్నారు. శ్రీనివాస్, శ్రీ దేవర తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Also Read : Chandrababu : ఎన్నికల వ్యూహాలపై బాబు నేతలకు దిశానిర్దేశం

Leave A Reply

Your Email Id will not be published!