Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తత ! టీడీపీ కడప అభ్యర్ధి మాదవిపై వైసీపీ నాయకుల దాడికియత్నం !

గన్నవరంలో ఉద్రిక్తత ! టీడీపీ కడప అభ్యర్ధి మాదవిపై వైసీపీ నాయకుల దాడికియత్నం !

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరంలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి విజయవాడకు కారులో వస్తూ గన్నవరంలో లో వైసీపీకు చెందిన సిద్ధం ఫ్లెక్సీలను గమనించారు. వెంటనే తన కారు ఆపి సెల్ ఫోన్ లో ఫొటోలు తీసి ఫ్లెక్సీల విషయం సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వర్గీయులు ఆమెపై దాడికి యత్నించారు. మాధవి కారు కదలనీయకుండా వాహనాలు అడ్డుపెట్టారు. దీనితో చాలా సేపు ఆమె కారులో ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న గన్నవరం(Gannavaram) టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు… తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సహా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.

Gannavaram Politics

కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… కొద్ది సంవత్సరాల క్రితం వైసీపీలో చేరారు. దీనితో అక్కడి వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నెల రోజుల క్రితం టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేయగా… ఈ సారి ఎన్నికల్లో టీడీపీ నుండి యార్లగడ్డ… వైసీపీ నుండి వల్లభనేని వంశీ తలపడుతున్నారు. దీనితో గన్నవరం రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Also Read : BRS Chief KCR: బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే కేజ్రీవాల్‌ అరెస్టు – కేసీఆర్‌

Leave A Reply

Your Email Id will not be published!