YS Sharmila: వైఎస్సార్ ఆశయాల సాధనకు ఆఖరి నిమిషం వరకు పొరాడతాను – ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

వైఎస్సార్ ఆశయాల సాధనకు ఆఖరి నిమిషం వరకు పొరాడతాను - వైఎస్ షర్మిల

YS Sharmila: కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అన్నా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కి ప్రాణమని… వాటికోసం ఆయన ఎంత దూరమైనా వెళ్ళేవారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీ లో చేరానని… అతని ఆశయాల సాధనకు కోసం చివరి నిమిషం వరకు పోరాడతానని ఆమె స్పష్టం చేశారు. శనివారం ఇడుపుల పాయలోని YSR ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి ఆమె నివాళులు అర్పించారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో కలిసి కాంగ్రెస్ ముఖ్య నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్, కాంగ్రెస్ పార్టీ అభిమానులతో YSR ఘాట్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్ ఘాట్ వద్ద ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

YS Sharmila Comment

ఈ సందర్భంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మాట్లాడుతూ రేపు (ఆదివారం ) ఉదయం విజయవాడ లో ఏపీపీసీసీ చీఫ్ గా భాద్యతలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చాను. వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను. దేశంలో సెక్యులరిజం అనే పదానికి, ఫ్యూడలిజం అనే పదాలకు అర్థం లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలంటే భారత దేశానికి మళ్ళీ మంచి జరగాలి. వైఎస్సార్ కోరుకున్నట్లు రాహుల్ గాంధీ ని ప్రధాని చేసే వరకు నా పోరాటం ఆగదు.

Also Read : TSRTC News : టీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగులకు ఒక్క రూపాయి చెల్లించకుండా రూ.1.12 కోట్ల బీమా

Leave A Reply

Your Email Id will not be published!