Sanjay Raut Defamation : సంజ‌య్ రౌత్ పై ప‌రువు న‌ష్టం దావా

హ‌త్య కుట్ర అభియోగంపై కేసు

Sanjay Raut Defamation : శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ కు బిగ్ షాక్ త‌గిలింది. మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడి నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉందంటూ త‌ప్పుడు ఆరోప‌ణ చేసినందుకు శివ‌సేన నాయ‌కుడు సంజ‌య్ రౌత్ పై ప‌రువు న‌ష్టం దావా వేశారు.

శ్రీ‌కాంత్ షిండే త‌న‌ను చంపేందుకు థానేకు చెందిన రాజా ఠాకూర్ కు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతే కాదు త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. రాష్ట్రంలో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. 

ఇదే స‌మ‌యంలో శివ‌సేన పార్టీ గుర్తు తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే వ‌ర్గానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం కేటాయించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఎంపీ సంజ‌య్ రౌత్. రూ. 2,000 కోట్లు చేతులు మారాయంటూ ఆరోపించారు. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది.

ఈ త‌రుణంలో సీఎం షిండే త‌న‌యుడిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం హాట్ టాపిక్ గా మార‌డంతో ఏకంగా సీఎం రంగంలోకి దిగాడు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన సంజ‌య్ రౌత్ పై ప‌రువు న‌ష్టం(Sanjay Raut Defamation) పిటిష‌న్ దాఖ‌లు చేశారు కోర్టులో. దీనిపై ఇంకా స్పందించ లేదు ఎంపీ సంజ‌య్ రౌత్. గ‌త కొంత కాలం నుంచీ శివ‌సేన వ‌ర్సెస్ శివ‌సేన తిరుగుబాటు శిబిరం , బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతూ వ‌స్తోంది.

Also Read : ఈసీ..షిండేకు షాక్ సుప్రీం నోటీసు

Leave A Reply

Your Email Id will not be published!