Pothula Sunitha : తండ్రీ కొడుకులవి నీచ రాజకీయాలు
వైసీపీ మహిళా నేత పోతుల సునీత
Pothula Sunitha : తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ(YSRCP) మహిళా అగ్ర నాయకురాలు పోతుల సునీత. భువనేశ్వరి అంటే తమకు గౌరవమని కానీ ఆమెను కూడా బజారుకీడ్చిన ఘనత తండ్రీ కొడుకులదేనని మండిపడ్డారు. ఆమెపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు.
భువనేశ్వరి గురించి ముందుగా నిలదీయాలంటే చంద్రబాబు నాయుడుని లోకేష్ నిలదీయాలని సూచించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే తమ పార్టీపై, నేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో దాడులు, అఘాయిత్యాలకు అంతు లేదన్నారు. ఆయన హయాంలో మహిళల వేధింపుల్లో రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో నిలిచిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు పోతుల సునీత.
బెజవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఇక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా తహశీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్లింది నిజం కాదా అని నిలదీశారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఆమెను చంద్రబాబు మందలించి పంపాడని, ఆయనకు మహిళలంటే గౌరవం లేదని ఆరోపించారు పోతుల సునీత.
Also Read : Raghunandan Rao Comment : కాకా రేపుతున్న ‘దుబ్బాక’