CM KCR Congrats : టమాటా రైతుకు సీఎం కంగ్రాట్స్
కోటికి పైగా ఆర్జించిన మహిపాల్ రెడ్డి
CM KCR Congrats : టమాటా ధరల పుణ్యమా అని రైతు మహిపాల్ రెడ్డి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. ఇవాళ బహిరంగ మార్కెట్ లో టమాటాల ధర కిలోకు రూ. 150 నుంచి రూ.200 పలుకుతున్నాయి. ఈ రైతు స్వస్థలం మెదక్ జిల్లా బాన్సువాడ. ఏకంగా ధరలు పెరగడంతో ఎంతో కష్టపడి తన పొలంలో పండించిన టమాటాలను పెద్ద ఎత్తున విక్రయించారు. దీంతో మహిపాల్ రెడ్డిని టమాటా పంట కరోడ్ పతిని చేసింది. ఏకంగా రూ.3 కోట్ల రూపాయల టమాటాలను అమ్మి రికార్డు సృష్టించాడు.
CM KCR Congrats Farmer
విషయం తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) ఆశ్చర్యానికి లోనయ్యారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదాక్ జిల్లాకు చెందిన రైతు గొప్ప ఘనతను సాధించడం చూసి సంతోషానికి లోనయ్యారు. వెంటనే అల్లుడు, మంత్రి తన్నీరు హరీశ్ రావును ఆదేశించారు. వెంటనే తన వద్దకు సదరు రైతు మహిపాల్ రెడ్డిని, ఆయన భార్యను తీసుకు రావాలని. హుటా హుటిన సమాచారాన్ని చేరవేశారు రైతు మహిపాల్ రెడ్డి దంపతులకు.
విషయం తెలుసుకున్న రైతు దంపతులు సంతోషానికి లోనయ్యారు. వారిని నేరుగా సీఎం కేసీఆర్ వద్దకు తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా రైతు మహిపాల్ రెడ్డిని, ఆయన భార్య ను సీఎం ప్రత్యేకంగా శాలువాలతో సన్మానించారు. అభినందనలతో ముంచెత్తారు. తాను కన్న కలను సాకారం చేశావంటూ కితాబు ఇచ్చారు. ఇదిలా ఉండగా మహిపాల్ రెడ్డి భార్య సర్పంచ్ గా పని చేస్తున్నారు. రైతు చదివింది మాత్రం 10వ తరగతి కావడం విశేషం.
Also Read : INDIA Stand : ‘ఇండియా’ గరం మోదీపై ఆగ్రహం