CPI Ramakrishna : జగన్ ఉంటే పోలవరం పూర్తి కాదు
ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
CPI Ramakrishna : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI Ramakrishna). మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
CPI Ramakrishna Comments on Jagan
పోలవరం నిర్వాసితులకు రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పారని దాని గురించి ఇప్పుడు ఊసెత్తడం లేదని మండిపడ్డారు రామకృష్ణ. ప్రస్తుతం పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటున్నారని ధ్వజమెత్తారు. అప్పుడు ఒక మాట ఇప్పుడు మరో మాట మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు రామకృష్ణ.
ఇప్పటికీ పలు మార్లు వాయిదా వేసుకుంటూ పోయారని ఎద్దేవా చేశారు. గతంలో 2020, 2021, 2022 అంటూ చెప్పుకుంటూ దాట వేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఐ నేత. ఇలాగైతే 2025 నాటికి సీఎంగా జగన్ రెడ్డి ఉంటారా అన్న అనుమానం వ్యక్తం చేశారు.
నిర్వాసితులను నీళ్లల్లో ముంచాడని ఇప్పుడు కొత్త రాగం ఆలాపిస్తున్నాడంటూ రామకృష్ణ ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి ఉన్నంత వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. అమరావతిని నాశనం చేసినట్టే జగన్ రెడ్డి పోలవరంను భ్రష్టు పట్టించే ప్లాన్ లో ఉన్నాడంటూ ఆరోపించారు.
Also Read : Gaurav Gogoi : మణిపూర్ కాలిపోతోంది – గౌరవ్ గొగోయ్