Raghunandan Rao : గృహలక్ష్మి పథకం ఎన్నికల స్టంట్
3 లక్షలతో ఇళ్లు తయారవుతుందా
Raghunandan Rao : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిప్పులు చెరిగారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన గృహ లక్ష్మి పథకం బక్వాస్ అని కొట్టి పారేశారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ కు తప్ప మరొకటి కాదని తేల్చి పారేశారు.
Raghunandan Rao Comments on KCR Govt
ఈ కాలంలో రూ. 3 లక్షలకు ప్లాట్ రావడం లేదని, ఇదే ధరతో ఇల్లు ఎలా నిర్మాణం అవుతుందో సీఎం కేసీఆర్ కే తెలువాలని అన్నారు. ఆయనేమో కోట్లాది ప్రజల ధనంతో విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకున్నాడని ఆరోపించారు. కనీసం పథకం ప్రకటించేటప్పుడు సోయి లేకుండా ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు రఘునందన్ రావు.
కేవలం గృహ లక్ష్మి పథకం అని ఆగ మేఘాల మీద ప్రకటన చేశారని ఆవేదన చెందారు. తిరిగి మూడు రోజులు మాత్రమే డెడ్ లైన్ విధించారని ధ్వజమెత్తారు దుబ్బాక ఎమ్మెల్యే(Raghunandan Rao). సంబంధిత శాఖ మంత్రి కానీ , ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కానీ పత్తా లేరని, ఈ పథకానికి చెందిన వివరాలను ఎవరు తెలియ చేస్తారంటూ ప్రశ్నించారు రఘునందన్ రావు.
కనీసం ఇల్లు కట్టుకోవాలంటే రూ. 10 లక్షలు కావాల్సి ఉంటుందన్నారు. కానీ నువ్వు ఇచ్చే 3 లక్షలతో బేస్ మెంట్ కూడా పూర్తి కాదన్నారు . డబుల్ బెడ్ రూమ్ పథకానికే డబ్బులు లేవంటూ పక్కన పెట్టారని, ఇప్పుడు తెర పైకి కొత్త హామీతో ముందుకు వచ్చారని ధ్వజమెత్తారు రఘునందన్ రావు.
Also Read : CPI Ramakrishna : జగన్ ఉంటే పోలవరం పూర్తి కాదు