Pawan Kalyan : ఇంకెంత కాలం ఈ దోపిడీ రాజ్యం

నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan : జ‌గ‌న్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). మూడో విడత వారాహి విజ‌య యాత్ర సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. ఇంకెంత కాలం ఈ దోపిడీ రాజ్యాన్ని కొన‌సాగిస్తారంటూ ప్ర‌శ్నించారు . ఎన్నిక‌ల వేళ ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇచ్చిన జ‌గ‌న్ ఆ త‌ర్వాత వాటిని మ‌రిచి పోయాడ‌ని ఎద్దేవా చేశారు.

Pawan Kalyan Slams YS Jagan

ఈ రాష్ట్రంలో ఒక్క‌రికైనా భ‌ద్ర‌త ఉందా అని ప్ర‌శ్నించారు. మొన్న అన్న‌వ‌రం దేవ‌స్థానంలో పూజారుల‌ను వేలం వేస్తానంటూ ప్ర‌క‌టించాడు. తాను నిల‌దీసే స‌రికి తోక ముడిచాడంటూ జ‌గ‌న్ ను ఉద్దేశించి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

అనంత‌పురం జిల్లాలో తాజాగా పోలీస్ స్టేష‌న్ లో మ‌ద్యం ప‌ట్టుకున్న వ్య‌క్తిని వ‌దిలి వేయాలంటూ ఏకంగా ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామి రెడ్డి అనుచ‌రుడు సాకే చంద్ర‌శేఖ‌ర్ దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. అస‌లు రాష్ట్రం ఎటు పోతోంద‌ని నిల‌దీశారు. డీజీపీ. ఎస్పీ ఏం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

రాష్ట్రంలో జ‌గ‌న్ వీర‌ప్ప‌న్ లాగా మారి పోయాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. సోమేశ్వ‌ర ఆల‌యంలో అర్చ‌కుడు ధ‌రించిన య‌జ్ఞోప వీతాన్ని తెంచి వేయ‌డం వైసీపీ బ‌రితెగింపున‌కు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

Also Read : Jailer Movie : ర‌జ‌నీ జైల‌ర్ భారీ ఓపెనింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!