TSRTC MD Sajjanar : ప్రయాణీకులకు ప్రత్యేక బస్సులు – ఎండీ
వరుస సెలవులతో ప్రత్యేక బస్సులు
TSRTC MD Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా శుభవార్త చెప్పారు. నిత్యం వేలాది మంది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తుంటారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుసగా సెలవులు రావడంతో రద్దీని తట్టుకునేందుకు గాను ముందస్తుగా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు వీసీ సజ్జనార్.
TSRTC MD Sajjanar Words about Special Buses
శుక్ర, శని, ఆదివారాలలో ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ముందు జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఎండీ.
ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, వివాఖపట్నం , కాకినాడ, అమలాపురం, బెంగలూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూరు , తదితర ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు వీసీ సజ్జనార్(TSRTC MD Sajjanar). ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు సకల ఏర్పాట్లు చేశామన్నారు.
ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుకింగ్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఎండీ కోరారు.
Also Read : MLC Kavitha : విపక్షాలపై కవిత కన్నెర్ర