Charminar Express : చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దొంగ‌ల బీభ‌త్సం

కావ‌లి వ‌ద్ద చోటు చేసుకున్న ఘ‌ట‌న

Charminar Express : ఇప్ప‌టికే రైల్వే శాఖ తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. ఈ త‌రుణంలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ప్ర‌యాణీకులు ల‌బోదిబోమంటున్నారు. రైళ్ల‌లో ఎక్కాలంటే జ‌డుసుకుంటున్నారు. తాజాగా దోపిడీ దొంగ‌ల బీభ‌త్సం భ‌యాందోన‌కు గురి చేసింది. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావ‌లి వ‌ద్ద చోటు చేసుకుంది.

Charminar Express Train Bogies Robbery Gang Issues

హైద‌రాబాద్ – చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు సింగ‌రాయ కండ – కావ‌లి మ‌ధ్య దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు(Charminar Express). సికింద్రాబాద్ నుంచి చెన్నైకి వెళుతున్న హైద‌రాబాద్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఎస్ 2, ఎస్4, ఎస్5 , ఎస్6, ఎస్7, ఎస్ 8 బోగీల్లో దోపిడీ దొంగ‌లు దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారు.

మ‌రో వైపు సికింద్రాబాద్ నుండి తాంబ‌రం వెళుతోంది ఈ ట్రైన్, ఎస్ 1, ఎస్ 2 బోగీల్లోనూ దోపిడీకి పాల్ప‌డ్డార‌ని స‌మాచారం. ఈ చోరీ ఘ‌ట‌న ఆదివారం అర్ధ‌రాత్రి 1.20 గంట‌ల నుండి 1.50 గంట‌ల మ‌ధ్య చోటు చేసుకుంది. రైల్వే శాఖ‌కు సంబంధించి సెక్యూరిటీ ఉన్నా ఏమీ చేయ‌లేక పోయార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ దారి దోపిడీకి సంబంధించి రైల్వే శాఖ ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Also Read : Sitanshu Kotak : భార‌త జ‌ట్టు కోచ్ గా సితాన్సు కోట‌క్

Leave A Reply

Your Email Id will not be published!