Revanth Reddy : కేసీఆర్ పాల‌న దోపిడీకి ఆలంబ‌న‌

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy : హైద‌రాబాద్ – కాళేశ్వ‌రం ప్రాజెక్టు డొల్ల‌త‌నం ఏమిటో తేలి పోయింద‌ని అయినా దానిని క‌ప్పి పుచ్చేందుకు బీఆర్ఎస్ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). బీఆర్ఎస్ స‌త్యాన్ని దాచేందుకు నానా తంటాలు ప‌డుతోంద‌న్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి, దోపిడీ కొన‌సాగుతున్నా బీజేపీ, ఎంఐఎం ఎందుకు మౌనంగా ఉన్నాయ‌ని ప్ర‌శ్నించారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy Slams BRS Party

త‌మ పార్టీ నేత‌లు కాళేశ్వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన‌ప్పుడు పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారంటూ ఆరోపించారు. ఈ దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల‌ను క‌ట్టిన ఘ‌న‌త త‌మ పార్టీకే ద‌క్కుతుంద‌న్నారు. కేసీఆర్ పెంపుడు ప్రాజెక్టు నిర్మించిన ఇన్నేళ్ల‌కే ఎందుకు మునిగి పోయింద‌ని నిల‌దీశారు రేవంత్ రెడ్డి.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి ఏటీఎం లాగా మారి పోయింద‌న్నారు. ఈ విష‌యాన్ని తాను చెప్ప లేద‌ని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్ప‌డాని, మ‌రి ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్క‌టేన‌ని ఆరోపించారు. దీనికి బహిరంగంగా ఎంఐఎం మ‌ద్ద‌తు ఇస్తోంద‌న్నారు.

Also Read : Modi Amit Shah Focus : తెలంగాణ‌పై మోదీ..షా ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!