Akunuri Murali : ప్ర‌జ‌ల‌కు దొర‌క‌ని దొర కేసీఆర్

మాజీ ఏఐఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి

Akunuri Murali : హైద‌రాబాద్ – మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్, సోష‌ల్ డెవ‌ల‌ప్మెంట్ ఫోరం క‌న్వీన‌ర్ ఆకునూరి ముర‌ళి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తీవ్రంగా స్పందించారు.

Akunuri Murali Serious Comments on KCR

సీఎం కేసీఆర్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మీరు పాల‌న ఎవ‌రి కోసం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఇన్నేళ్ల‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రాలేక పోయార‌ని ఆరోపించారు.

ఇంత కాలం దోచు కోవ‌డం, దాచు కోవ‌డం త‌ప్పితే చేసింది ఏమీ లేద‌ని ఆరోపించారు ఆకునూరి ముర‌ళి. ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన త‌ర్వాత ఒక్క‌సారైనా త‌ను గెలిచిన నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లారా అని ప్ర‌శ్నించారు. కేవ‌లం మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇక పరిపాల‌న‌కు సంబంధించి మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌కు మీరు దొర‌క లేద‌న్నారు. అంతే కాదు ఉన్నాధికారులు, క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు మీరు అందుబాటులో ఎన్న‌డున్నార‌ని నిల‌దీశారు ఆకునూరి ముర‌ళి.

Also Read : Srinivas Goud : బీసీల జ‌పం బీజేపీ మోసం

Leave A Reply

Your Email Id will not be published!