Nara Lokesh : లేఖ రాయడం కూడా నేరమేనా
జగన్ సర్కార్ పై నారా లోకేష్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ ఏసీబీ కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ లేఖ రాశారు. తాను అక్రమాలకు పాల్పడ లేదని పేర్కొన్నారు.
Nara Lokesh Comment
వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఓడి పోతుందని భయపడి తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పేర్కొన్నారు. తాను నిర్భయంగా బయటకు వస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు.
ఈ లేఖపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. 45 ఏళ్ల రాజకీయంలో నువ్వు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. దోచు కోవడం, దాచు కోవడం, అక్రమాలకు పాల్పడ్డారని లక్ష కోట్లకు పైగా సంపాదించాడని ఆరోపించారు. ఈ గజదొంగకు మరో దత్త పుత్రుడు కూడా కారణమని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా తన తండ్రి లేఖ రాయడాన్ని తప్పు పట్టడంపై తీవ్రంగా స్పందించారు ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) . జగన్ జమానాలో జనానికి భద్రత లేకుండా పోయిందన్నారు. లేఖ రాయడం కూడా నేరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Ambati Ram Babu : బాబు లేఖకు అంబటి కౌంటర్