CPI Ramakrishna : ఏపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపం
రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు
CPI Ramakrishna : విజయవాడ – రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఏపీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు ఏపీ సీపీఐ సీనియర్ నాయకుడు రామకృష్ణ(CPI Ramakrishna). సోమవారం బెజవాడ లోని ధర్నా చౌక్ లో సీపీఐ 30 గంటల నిరసన దీక్షకు దిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ హాజరై ప్రసంగించారు.
CPI Ramakrishna Slams AP Govt
ఇవాళ సామాన్యులు, రైతులు బతికే పరిస్థితులు లేవన్నారు. ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తోందని, కృష్ణా జలాల పునః పంపిణీ సమీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నారు రామకృష్ణ.
ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రామకృష్ణ. ఇప్పటి వరకు 444 మండలాల్లో పంటలు ఎండి పోయాయని ఈ విషయాన్ని తాము ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఇంత జరుగుతున్నా జగన్ లో చలనం లేకుండా పోయిందన్నారు. ఆరుగాలం పండించే రైతుల పట్ల ఇంత దయనీయంగా వ్యవహరిస్తుంటే ఎలా అని మండిపడ్డారు. ఇవాళ ప్రతిపక్షాలు నెత్తీ నోరు బాదుకున్నా పట్టించు కోవడం లేదన్నారు రామకృష్ణ.
Also Read : CM KCR : నేను లేక పోతే తెలంగాణ వచ్చేదా