Chandra Babu Case : బాబుకు రిలీఫ్ బెయిల్ మంజూరు

తీర్పు చెప్పిన ఏపీ హైకోర్టు

Chandra Babu Case : అమ‌రావ‌తి – టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ ల‌భించింది. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజ‌మండ్రి జైలులో ఉన్నారు. ఇటీవ‌లే కంటి శ‌స్త్ర చికిత్స కోస‌మ‌ని నాలుగు వారాల పాటు ముంద‌స్తు బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.

Chandra Babu Case Got Relief

ఇదిలా ఉండ‌గా ఏపీ సీఐడీ చంద్ర‌బాబు నాయుడుపై 8 కేసులు న‌మోదు చేసింది. ఇందులో ప్ర‌ధానంగా ఏపీ స్కిల్ స్కామ్ తో పాటు ఫైబ‌ర్ నెట్ స్కాం, అమ‌రావ‌తి ఇన్న‌ర్ రోడ్డు ఎలైన్మెంట్ స్కామ్ , మైనింగ్ స్కాం కేసు కూడా ఉంది.

ఇక ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి సోమ‌వారం ఏపీ హైకోర్టులో తుది విచార‌ణ జ‌రిగింది. ఇరు ప‌క్షాల వాదోప‌వాద‌నలు విన్న కోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. చంద్ర‌బాబు నాయుడుకు(Chandra Babu) రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

దీంతో తెలుగేద‌శం పార్టీలో హ‌ర్షాతిరేకం వ్య‌క్తం అవుతోంది. ఇదే ఏపీ స్కిల్ స్కాం కేసులో తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మొత్తంగా టీడీపీ , జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌కు ఇది శుభ‌వార్త అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Nitin Gadkari : స్థిర‌మైన ప్ర‌భుత్వం బీజేపీతోనే సాధ్యం

Leave A Reply

Your Email Id will not be published!