Revanth Reddy Visit : కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – రేవంత్

య‌శోద‌లో ప‌రామ‌ర్శించిన ముఖ్య‌మంత్రి

Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తుంటి శ‌స్త్ర చికిత్స చేయించుకుని ప్ర‌స్తుతం ఆరోగ్యంగా బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ను ఆదివారం ప‌రామ‌ర్శించారు సీఎం. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఆరోగ్యం గురించి వాక‌బు చేశారు. స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించారు. రేవంత్ రెడ్డిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు.

Revanth Reddy Comment about KCR Health

కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు సీఎం. ఆ వెంట‌నే కేసీఆర్ ప్ర‌స్తుతం బాగానే ఉన్నార‌ని, కోలుకునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న బావ బావ‌మ‌రుదులు హ‌రీశ్ రావు, కేటీఆర్ ల‌ను ప‌ల‌క‌రించారు రేవంత్ రెడ్డి.

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం స‌హ‌జ‌మ‌ని పేర్కొన్నారు సీఎం. కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. మాజీ సీఎంను ప‌రామ‌ర్శించిన అనంత‌రం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ అసెంబ్లీకి రావాల‌ని, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై మాట్లాడాల‌ని అన్నారు. మంచి ప్ర‌భుత్వాన్ని అందించేందుకు ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు అత్యంత అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు సీఎం. మొత్తంగా నిన్న‌టి దాకా రేవంత్ రెడ్డిని అన‌రాని మాట‌లు అన్నా ఒక బాధ్య‌త క‌లిగిన సీఎంగా త‌న విధిని నిర్వ‌ర్తించారు.

Also Read : Harish Rao : రైతు బంధు ఇంకెప్పుడు

Leave A Reply

Your Email Id will not be published!