Eatala Rajender : మ‌ళ్లీ మోదీనే దేశానికి పీఎం

బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్

Eatala Rajender : హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దేశంలో మ‌రోసారి బీజేపీ ప్ర‌భుత్వ‌మే రాబోతోంద‌ని జోష్యం చెప్పారు. ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధాన‌మంత్రిగా కానున్నార‌ని, ఆయ‌న సార‌థ్యంలోనే దేశం సుభిక్షంగా ఉంటుంద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

Eatala Rajender Comment

తాము గతంలో వ‌చ్చిన సీట్ల కంటే ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా తెలంగాణ లోనూ అత్య‌ధిక సీట్ల‌ను బీజేపీ కైవ‌సం చేసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి ప్ర‌శ్నించే బీజేపీ గొంతుక‌ల‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు.

ఎన్నిక‌లు అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని, దీనిని తాము స్వీక‌రిస్తామ‌ని ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించామ‌ని తెలిపారు. తాము ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender). ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని పోరాడుతూనే ఉంటామ‌ని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

నిన్న‌టి దాకా ఉన్న నిర్బంధ స‌ర్కార్ ఉండేద‌ని, దానికి జ‌నం చ‌ర‌మగీతం పాడార‌ని దీనిని ప్ర‌జ‌లు చేసి చూపించార‌ని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి.

Also Read : Revanth Reddy Visit : కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!