Chandra Babu Naidu : ప్ర‌జా ధ‌నం జ‌గ‌న్ ప్ర‌చారం

చంద్రబాబు నాయుడు ఫైర్

Chandra Babu Naidu : అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారి పోతున్నాయ‌ని, దీనికంతటికి ప్ర‌ధాన కార‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే నంటూ మండిప‌డ్డారు. అనాలోచిత నిర్ణ‌యాలు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Chandra Babu Naidu Comments on AP CM YS Jagan

అందినంత మేర‌కు దోచుకోవ‌డం, దోచుకున్న దానిని దాచుకునేందుకు జ‌గ‌న్ రెడ్డి ఇంత కాలం ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చార‌ని ఆరోపించారు నారా చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu Naidu). త‌న పుట్టిన రోజు వ్య‌క్తిగ‌త‌మ‌ని , అదేదో రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం లాగా నిర్వ‌హించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు టీడీపీ చీఫ్‌.

ఒక‌వేళ నువ్వు నీ ఇంట్లో పండ‌గ చేసుకో..కానీ ప్ర‌జ‌ల డ‌బ్బుల‌తో నీ స్వంత ప‌త్రిక‌లో, ఛాన‌ల్ లో రూ.100 కోట్ల‌తో ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం, ప్ర‌చారం చేసుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు నారా చంద్ర‌బాబు నాయుడు. క్రిస్మ‌స్ ఫెస్టివ‌ల్ పేరుతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లూటీ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక అన్నింటినీ క‌క్కిస్తామ‌ని హెచ్చ‌రించారు.

Also Read : Ana konidela Pawan Kalyan : అనాధల‌తో అనా కొణిదెల క్రిస్మ‌స్

Leave A Reply

Your Email Id will not be published!