AP CM YS Jagan : కేజీ బంగారం బెంజ్ కార్ ఇస్తారన్న.. సీఎం జగన్

ఈరోజు కాకినాడలో జరిగిన సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు

AP CM YS Jagan : కాకినాడ సభలో సీఎం జగన్(AP CM YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేసారు, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు మరిన్ని కుట్రలకు తెరతీస్తాయని అన్నారు, కుటుంబాలను చీల్చడానికైనా సిద్దపడతారన్న జగన్. కేజీ బంగారం బెంజ్ కార్ కూడా ఆఫర్ చేస్తారు, అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం జగన్.

AP CM YS Jagan Comments

ఇక సీఎం మీటింగ్ లో ఇలా అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్దాలు చెపుతారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది.  ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామన్న నాయకులూ వస్తారు,  ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులూ కూడా మీ ఇంటి దగ్గరకి వస్తారు.

రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువగా జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి , కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి, అలానే పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీల్చే, రాజకీయాలు చేస్తారు అబద్దాలు చెపుతారు మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు ఏపీ సీఎం వైయస్ జగన్.

Also Read : CM Revanth Reddy : రెండు పదవులతో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!