Uttar Pradesh : యువతిని హత్య చేసిన ముగ్గురిపై పోలీసులు కాల్పులు

యువతిని హత్య చేసిన ముగ్గురిపై పోలీసులు కాల్పులు

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో పోలీసులు కాల్పులు జరిపారు . పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు గాయపడ్డారు. సుల్తాన్‌పూర్‌లో పెళ్లి పేరుతో యువతిని వంచించి మోసం చేసి, హత్య చేసిన నిందితులు సల్మాన్, సర్వర్, జావేద్‌లపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలపాలైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పులు అఖండ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

అదనపు పోలీసు సూపరింటెండెంట్ అఖండ్ ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 21న గోసైంగంజ్ ప్రాంతంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైందన్నారు. ఊపిరాడక ఆ యువతి మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలిందని తెలిపారు. అయితే ఇంతలో ఒక యువతి అదృశ్యంపై జూన్ ఒకటిన కడిపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయ్యిదన్నారు.

సల్మాన్‌, షహెన్‌షా, సర్వర్‌, జావేద్‌ అనే నలుగురు యువకులకు ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముందుగా సల్మాన్‌ ఆ యువతిని ముంబై తీసుకువెళ్లాడు. అనంతరం ఆమె తనను పెళ్లి చేసుకోవాలని సల్మాన్‌ను అడిగింది. దీంతో సల్మాన్‌ పెళ్లికి నిరాకరిస్తూ, ఆమెను తప్పుడు కేసులో జైలుకు పంపుతానని బెదిరించాడు. అనంతరం సల్మాన్, అతని సహచరులు ఒక పథకం ప్రకారం సెప్టెంబర్ 20 న ఆమెను హత్య చేశారు. ఈ కేసులో షాహెన్‌షాను అరెస్టు చేసిన పోలీసులు.. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అఖండ్‌నగర్ ప్రాంతంలో పోలీసులు వారిని వెంబడించి, కాల్పులు జరిపారు. తరువాత వారిని అదుపులోకి తీసుకొని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!