Building Collapsed: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం ! నలుగురు మృతి !
ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం ! నలుగురు మృతి !
Building Collapsed : దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. క్యాపిటల్ రీజియన్ లో నాలుగు అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Building Collapsed in Delhi
అర్ధరాత్రి 3గం. ప్రాంతంలో ముస్తాఫాబాద్ లో ఓ భవనం కుప్పకూలినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనితో ఎన్డీఆర్ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం కల్లా నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో డజను మందికి పైనే శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే.. ఆ భవనంలో ఒక పోర్షన్ లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది నివాసం ఉంటున్నారని, అందులో ఆరుగురు చిన్నపిల్లలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వాళ్ల జాడ ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే…
ఢిల్లీలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ ప్రభావంతోనే భవనం కూలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతవారం కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా… ఇద్దరు గాయపడ్డారు.
Also Read : Governor CV Ananda Bose: బెంగాల్ లో అల్లర్ల బాధితులను కలిసిన గవర్నర్ సీవీ ఆనందబోస్