అమెరికా : అమెరికా దేశ చరిత్రలో కీలకమైన నిర్ణయానికి తెర లేపారు ప్రస్తుత దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ . ఏకంగా సుదీర్ఘ కాలంగా వస్తున్న 165 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు పలికారు. సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో తొలిసారిగా అమెరికా ఫెడరల్ కరెన్సీని జారీ చేసినప్పటి నుండి, దానిపై సంతకాలు చేసిన కోశాధికారుల అవిచ్ఛిన్న పరంపరలో మలేర్బా చివరి వ్యక్తి కానున్నారు. అమెరికా సర్కార్ కీలక ప్రకటన చేసింది శుక్రవారం. ఈ వేసవి నుంచి అమెరికా కాగితపు కరెన్సీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉంటుందని ప్రకటించింది. ఇదిలా ఉండగా అధికారంలో ఉన్న అధ్యక్షుడు అమెరికా డబ్బుపై సంతకం చేయడం ఇదే మొదటిసారి అని ట్రెజరీ డిపార్ట్మెంట్ తెలిపింది.
అమెరికా స్వాతంత్ర 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పునః రూపకల్పన చేసిన ఈ నోట్లపై, 165 ఏళ్లలో తొలిసారిగా అమెరికా కోశాధికారి సంతకం ఉండదు. ఈ కోశాధికారి ట్రెజరీ సెక్రటరీకి నివేదిస్తారు . బ్యూరో ఆఫ్ ఎంక్రావింగ్ అండ్ ప్రింటింగ్, యూ.ఎస్. మింట్ , ఇతర ట్రెజరీ విధులను పర్యవేక్షిస్తారు. . ట్రంప్ , అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సంతకాలతో కూడిన మొదటి $100 నోట్లు జూన్లో ముద్రించనున్నట్లు ప్రభుత్వం స్పస్టం చేసింది. ఆ తర్వాత నెలల్లో ఇతర నోట్లు వస్తాయి. ఈ కొత్త నోట్లు బ్యాంకుల్లో చలామణి కావడానికి కొన్ని వారాలు పట్టవచ్చు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ , మాజీ ట్రెజరర్ లిన్ మలెర్బా సంతకాలతో కూడిన నోట్లను ట్రెజరీ ఇప్పటికీ ముద్రిస్తోంది. 1861లో అమెరికా ప్రభుత్వం మొదటిసారిగా అమెరికా ఫెడరల్ కరెన్సీని జారీ చేసినప్పటి నుండి, దానిపై సంతకాలు కనిపించిన ట్రెజరర్ల అవిచ్ఛిన్న పరంపరలో మలెర్బా ఆఖరి వ్యక్తి అవుతారు.
