వైసీపీకి రాష్ట్రంలో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలి
రాష్ట్ర భారీ నీటి పరిశ్రమల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి : ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. తనకు పార్టీ పరంగా మాట్లాడే హక్కు లేదన్నారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గొడ్డలి పార్టీకి రాష్ట్రంలో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదంను మించిన ఉన్మాదంతో రాష్ట్రంలో జగన్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు.
చంపుతాం, నరుకుతాం, అంతుచూస్తాం, అంతం చేస్తాం వంటి రాజకీయ విధానాలతో జగన్ పోతున్నాడని మండిపడ్డారు నిమ్మల రామానాయుడు. అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, పనులు ఆపేస్తాం, యువతను చెడగొడతాం, మాదక ద్రవ్యాలు అమ్మిస్తాం, మహిళలను బయటకు గెంటుతాం అంటూ రాజకీయ హామీలు జగన్ ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు.
బయటి వారైనా, బాబాయ్ అయినా రాజకీయంగా అడ్డొస్తే, అంతం చెయ్యడమే జగన్ విధానం తప్పా మరోటి కాదన్నారు. తల్లికి, చెల్లికి ఏం చేశానే అంతకంటే ఎక్కవు చేస్తాను అంటూ నయవంచక మహిళా విధానం జగన్ ది అని పేర్కొన్నారు. కొత్త, కొత్తగా మాదక ద్రవ్యాలు తెస్తాం, యువతకు దానితో ఉపాధి కల్పించడమే జగన్ యూత్ పాలసీ అని మండిపడ్డారు. నేరాలు అరికడతాం, శాంతి భద్రతలు కాపాడుతాం అని కాకుండా రప్పా, రప్పా అంటూ నరుకుతాం అంటూ ఉన్మాదంతో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు నిమ్మల రామానాయుడు.
జగన్ అకృత్యాల్ని, వికృత చేష్టలను మీడియా చెబితే నాలుక కోసేస్తాం, పలుకు లేకుండా చేస్తాం, అంతం చేస్తాం అంటూ మీడియా పై ఉన్మాదంతో బహిరంగంగా మాట్లాడుతున్నారని , తనను జనం నమ్మరన్నారు. వినాశనం, విధ్వంశం, ఎజెండాగా గొడ్డలి జెండాగా వైసిపి పార్టీ గొడ్డలి పార్టీగా మారిందన్నారు.రాజకీయ భవిష్యత్ కోసం నాడు వివాదరహితుడు వివేకాను ఎంపి పదవికి రాజీనామాను బలవంతంగా జగన్ చేయిస్తే, సోనియా మందలించ లేదా అని ప్రశ్నించారు. తండ్రి ఆచూకీ లభ్యం కాకుండానే సంతకాలు ఎలా పెట్టించుకున్నారని అడిగారు. నాడు తండ్రి మరణానికి రిలయన్స్ కారణమని, తర్వాత వారికి పదవులు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు..
