హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో సహా పార్టీ నాయకులు, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించిన వినతి పత్రంలో ఒక ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం, బూత్ స్థాయి అధికారులు పూరించిన వివరాల సేకరణ ఫారమ్లను అప్లోడ్ చేయడానికి ఎంఐఎం నాయకులకు ఈసీఐ యాప్ను యాక్సెస్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా చేయాల్సిన ఇంటింటి సందర్శనలను విస్మరిస్తున్నారని బీజేపీ అధినేత ఆరోపించారు.
దానికి బదులుగా, హైదరాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీలు ఏర్పాటు చేసిన శిబిరాల వద్ద, ప్రస్తుతం జరుగుతున్న వివరాల సేకరణ ప్రక్రియకు సంబంధించిన ఫారమ్లను ఎంఐఎం నాయకులకు ‘భారీ సంఖ్యలో’ పంపిణీ చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు రామచందర్ రావు. ముఖ్యంగా హదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనూ, సైబరాబాద్, మల్కాజిగిరి, వరంగల్ , కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనూ చాలా మంది ఓటర్లకు వివరాల సేకరణ ఫారమ్లు అందలేదని, అలాగే ఇళ్లను గుర్తించడంలో బీఎల్ ఓలు ఇబ్బంది పడుతున్నారని పార్టీ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేర్వేరు పోలింగ్ బూత్ల జాబితాల్లో ఉండటం వల్ల, ఆయా ఇళ్లను సందర్శించడం BLOలకు కష్టంగా మారుతోందని పార్టీ పేర్కొంది.
