ఇంటింటి గ‌ణ‌నలో ఆధార్ తప్ప‌నిస‌రి కాదు

స్ప‌ష్టం చేసిన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు, అలాగే అక్టోబర్ 1, 2026 నాటికి లేదా అంతకు ముందు 18 ఏళ్లు నిండబోయే వారు, సవరణ ప్రక్రియ సమయంలో ఫారం-6 ద్వారా ఓటర్ల జాబితాలో చేర్చబడటానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. చిరునామా మార్పులకు సంబంధించి, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత ఓటర్లు ఫారం-8ను సమర్పించాల‌ని స్ప‌ష్టం చేసింది. అటువంటి అభ్యర్థనలు క్లెయిమ్‌లు, అభ్యంతరాల కాలంలో ప్రాసెస్ చేయబడతాయని తెలిపింది.

ఇంటింటి గణన దశలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని సీఈఓ మరింత స్పష్టం చేశారు. అయితే, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత ధృవీకరణ అవసరమైన సందర్భాలలో, అర్హతను నిర్ధారించడానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు) సహాయక పత్రాలను కోరవచ్చు. వీటిలో జనన ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌లు, విద్యా ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, భూ కేటాయింపు ధృవీకరణ పత్రాలు మరియు ఇతర అధికారికంగా గుర్తించబడిన రికార్డులు ఉండవచ్చు.

పౌరులు తమ గణన ఫారాలను వెంటనే తిరిగి ఇవ్వాలని సూచించారు. ఒకవేళ ఫారాలు సమర్పించక పోయినా, విచారణలో ఓటరు గైర్హాజరైనా, వేరే చోటికి మారినా, మరణించినా, లేదా వేరే చోట డూప్లికేట్ అయినా, అటువంటి పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చక పోవచ్చని హెచ్చరించారు . ఓటర్ల జాబితాలు కచ్చితంగా, సమగ్రంగా, దోషరహితంగా ఉండేలా చూసేందుకు, అర్హులైన ఓటర్లందరూ ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, బూత్ స్థాయి అధికారులకు సహకరించాలని సీఈఓ విజ్ఞప్తి చేశారు.

సహాయం కోసం, ఓటర్లు తమ సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించవచ్చు, “బి.ఎల్.ఓ.తో కాల్ బుక్ చేసుకోండి” సదుపాయాన్ని ఉపయోగించు కోవచ్చు, లేదా ఓటరు హెల్ప్‌లైన్ నంబర్ 1950కు కాల్ చేయవచ్చని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!