Anand Sai Pawan Kalyan : పవన్ తో ప్రయాణం ఆనందం
పవన్ కళ్యాణ్ మామూలోడు కాదు
Anand Sai Pawan Kalyan : హైదరాబాద్ – ఆర్కిటెక్క్ గా సుపరిచితులు అందరికీ ఆనంద్ సాయి(Anand Sai). ఆయన శిల్ప కళా నైపుణ్యంలో అందె వేసిన చేయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ సహకారంతో తెలంగాణలో పేరు పొందిన యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రూపు రేఖలను పూర్తిగా మార్చేశారు. ఈ పవిత్రమైన గుడిని పునర్ నిర్మించారు. వందలాది కోట్లు ఖర్చు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో ఇది రూపు దిద్దుకుంది.
Anand Sai Pawan Kalyan Journey
అయితే కేవలం తమ స్థలాలకు రేట్లు పెంచుకునేందుకు, రియల్ ఎస్టేట్ దందా పెరిగేందుకు గాను యాదగిరిగుట్టను తిరిగి పునర్ నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది పక్కన పెడితే అత్యద్భుతంగా ఆలయాన్ని తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించారు ఆర్కిటెక్క్ ఆనంద్ సాయి.
ఆయన పలు సినిమాలకు కళా దర్శకుడిగా పని చేశారు., ప్రత్యేకించి జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దగ్గరి అనుబంధం ఉంది. అంతకు మించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మంచి సాన్నాహిత్యం ఉండడంతో వీరి కలయికకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా పవన్ కళ్యాణ్ తో ఆనంద్ సాయి ప్రయాణం చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Congress Slams : కేసీఆర్ పాలనలో నిలువు దోపిడీ