Congress Slams : కేసీఆర్ పాల‌న‌లో నిలువు దోపిడీ

నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ

Congress Slams : హైద‌రాబాద్ – తెలంగాణ పేరుతో మాజీ సీఎం కేసీఆర్ విధ్వంసం సృష్టించార‌ని, అంతులేని సంప‌ద‌ను అందినంత మేర దండుకున్నాడ‌ని తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించింది కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా బుధ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తాజాగా అధికారంలోకి వ‌చ్చిన త‌మ‌పై లేనిపోని అభాండాలు వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించింది. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించింది.

Congress Slams KCR

నిత్యం అబ‌ద్దాల‌తో, మాయ మాట‌ల‌తో నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకాన్ని నిట్ట నిలువునా మోసం చేసిన ఘ‌న‌త కేసీఆర్ ది కాదా అని ప్ర‌శ్నించింది. మిమ్మ‌ల్ని న‌మ్మి రెండుసార్లు ప‌ట్టం క‌డితే మీరు చేసింది ఏమీ లేద‌ని ఎద్దేవా చేసింది. కేవ‌లం ఆ న‌లుగురికే తెలంగాణ వ‌చ్చింద‌ని మిగ‌తా వారంతా అరిగోస ప‌డ్డారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

రైతుల‌కు ల‌క్ష రూపాయ‌లు రుణ మాఫీ చేశారా, ఏనాడైనా స‌మ‌యానికి ఉద్యోగుల‌కు జీతాలు ఇచ్చారా, కౌలు రైతుల‌ను ప‌ట్టించుకున్నారా..ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని చెప్పిన మీరు ఒక్క జాబ్ అయినా ఇచ్చారా అని నిల‌దీసింది కాంగ్రెస్ పార్టీ(Congress ). ఇక‌నైనా అభాండాల‌కు స్వ‌స్తి చెప్పి ప్ర‌తిప‌క్షంగా నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించాల‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : Telangana NRIs : భ‌ట్టితో తెలంగాణ ఎన్నారైల భేటీ

Leave A Reply

Your Email Id will not be published!