Telangana NRIs : భట్టితో తెలంగాణ ఎన్నారైల భేటీ
అమెరికా సభలకు ఆహ్వానం
Telangana NRIs : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు తెలంగాణ ఎన్నారైలు(NRI). మంగళవారం సచివాలయంలో కలిసి అమెరికాకు రావాల్సిందిగా కోరారు. తమ సంస్థ తరపున ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
Telangana NRIs Met Bhatti Vikramarka
వచ్చే ఏడాది మే 24 నుంచి 26 వరకు అమెరికాలో జరిగే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహా సభలకు రావాలని విన్నవించారు. ఈనెల 23న రవీంద్రభారతిలో జరిగే సేవ డేస్ కార్యక్రమానికి రావాలని కోరారు ఎన్నారైలు.
సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలి పెద్ది నవీన్ , కవితా రెడ్డి, సురేష్ రెడ్డి, గణేష్ , జ్యోతి రెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గా ప్రసాద్ , మనోహర్ భట్టి విక్రమార్కను కలిసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 10 నుంచి 23 వరకు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు.
వరంగల్ లో 38 కంపెనీల సహకారంతో జాబ్ మేళా నిర్వహించామని 16 వేల మంది హాజరయ్యారని, ఇందులో 1500 మంది నిరుద్యోగులకు జాబ్స్ కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారైలను ప్రత్యేకంగా అభినందించారు డిప్యూటీ సీఎం.
Also Read : IPS Officers Transffers : డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు