IPS Officers Transffers : డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు
20 మంది ఐపీఎస్ లు బదిలీ
IPS Officers Transffers : హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కొత్త సర్కార్ భారీ ఎత్తున బదిలీలకు తెర లేపింది. ఇప్పటికే సీనియర్ అధికారుల పనితీరును పరిగణలోకి తీసుకుని ట్రాన్స్ ఫర్స్ చేసింది. మంగళవారం 20 మంది ఐపీఎస్ లకు స్థాన చలనం కల్పించింది.
IPS Officers Transffers Viral in Telangana
ఇక డీజీపీగా రవి గుప్తాను ఉంచుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠకు తెర దించింది. ఈ మేరకు ఆయనను కొనసాగించేందుకే మొగ్గు చూపింది. పలువురిని కీలక పదవుల్లో నియమించింది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా అంజనీ కుమార్ , ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ , రైల్వే డీజీగా మహేష్ భగవత్ , సీఐడీ చీఫ్ గా శిఖా గోయల్ , జైళ్ల శాఖ డీజీగా సౌమ్యా మిశ్రా , ఎస్ఐబీ చీఫ్ గా సుమతి, సీఐడీ డీఐసీగా రమేష్ నాయుడు, సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్ చంద్రను నియమించింది సర్కార్.
ఇక కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్య నారాయణ, అప్పా డైరెక్టర్ గా అభిలాష్ , మల్టీ జోన్ ఐజీగా తరుణ్ జోషి, ప్రొబేషన్ ఎక్సైజ్ డైరెక్టర్ గా కమల్ హాసన్ రెడ్డి, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ హౌసింగ్ బోర్డు ఎండీగా రాజీవ్ రతన్ , డీజీగా అనిల్ కుమార్ , ఏసీబీ డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ , ఐజీ పర్సనల్ గా చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డు ఏడీగా ఎం. రమేష్ , డీజీపీ ఆఫీస్ కు ఎం. శ్రీనివాసులును అటాచ్ చేసింది.
Also Read : Akhilesh Yadav : ఇండియా కూటమిదే విజయం