Bhatti Vikramarka : ఆరు నూరైనా గెలిచేది నేనే

మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కామెంట్

Bhatti Vikramarka : మ‌ధిర – సీఎల్పీ నేత , మ‌ధిర కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆరు నూరైనా గెలిచేది తానేన‌ని అన్నారు. త‌న గెలుపును ఏ శ‌క్తి అడ్డుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం మ‌ధిరలో విజ‌య భేరి స‌భ చేప‌ట్టారు. బీఆర్ఎస్ పాల‌నలో తెలంగాణ రాష్ట్రం అస్త‌వ్య‌స్తంగా మారింద‌న్నారు.

Bhatti Vikramarka Comment

సంక్షేమ ప‌థ‌కాలు పూర్తిగా ప్ర‌జ‌ల‌కు అందిన పాపాన పోలేద‌న్నారు. తెలంగాణ పేరుతో స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఆరోపించారు. జ‌నం గోస‌ను ప‌ట్టించు కోలేద‌ని వాపోయారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌(Bhatti Vikramarka). 2 ల‌క్ష‌ల‌కు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఒక్క‌టి కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌ని వాపోయారు. కేసీఆర్ నిర్వాకం వ‌ల్ల నిరుద్యోగులు, రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. దీనికి కార‌ణం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలే అని మండిప‌డ్డారు.

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని ఇది త‌థ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమ‌లు చేసి తీరుతామ‌న్నారు. తాము తీసుకు వ‌చ్చిన మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టింద‌ని ఆరోపించారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన సీఎంకు ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించ‌డం త‌ప్ప‌ద‌న్నారు. జ‌నాన్ని త‌క్కువ అంచ‌నా వేసిన ఏ నాయ‌కుడు బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన ప‌రిస్థితి లేకుండా పోయింద‌న్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

Also Read : Malla Reddy Case : మ‌ల్ల‌న్న‌కు షాక్ కేసు న‌మోదు

Leave A Reply

Your Email Id will not be published!