PM Modi Wishes : ఏసు క్రీస్తు జీవితం స్పూర్తి దాయ‌కం

క్రిస్మ‌స్ సంద‌ర్బంగా ప్ర‌ధాని గ్రీటింగ్స్

PM Modi Wishes : న్యూఢిల్లీ – ప్ర‌పంచ వ్యాప్తంగా క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖులు క్రిస్మ‌స్ గ్రీటింగ్స్ చెబుతున్నారు. తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఏసు క్రీస్తు జీవితం ప్ర‌తి ఒక్క‌రికీ స్పూర్తి దాయ‌కమ‌ని పేర్కొన్నారు . ఆయ‌న చేసిన బోధ‌న‌లు ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌ని కొనియాడారు ప్ర‌దాన మంత్రి.

PM Modi Wishes Christmas Festival

అంద‌రికీ శాంతి, శ్రేయ‌స్సు క‌ల‌గాల‌ని ఆకాంక్షించారు. సోమ‌వారం క్రిస్మ‌స్ సంద‌ర్బంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. ఈ పండుగ సీజ‌న్ అంద‌రీకీ ఆనందం, శాంతి, శ్ర‌య‌స్సును అందించాల‌ని పిలుపునిచ్చారు. క్రిస్మ‌స్ ప్ర‌తీక అయిన సామ‌ర‌స్యం, క‌రుణ స్పూర్తిని జ‌రుపుకుందామ‌ని కోరారు న‌రేంద్ర మోదీ.

ప్ర‌తి ఒక్క‌రూ సంతోషంగా , ఆరోగ్యంగా ఉండే ప్రపంచం కోసం కృషి చేయాల‌ని ప్ర‌ధాన మంత్రి(PM Modi) పిలుపునిచ్చారు. ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా వివిధ రాష్ట్రాల‌లో సామూహిక ప్రార్థ‌న‌లు జ‌రిగాయి. చ‌ర్చీల‌న్నీ దీపాల వెలుగులు సంత‌రించుకున్నాయి.

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని సేక్రెడ్ హార్ట్ కేథ‌డ్ర‌ల్ క్యాథ‌లిక్ చ‌ర్చితో పాటు బెంగ‌ళూరు లోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథ‌లిక్ చ‌ర్చిలో సామూహిక ప్రార్థ‌న‌లు జ‌రిపారు.

Also Read : Covid19 : 4 వేలు దాటిన క‌రోనా కేసులు

Leave A Reply

Your Email Id will not be published!