పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు
పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయకుడు , లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం మరాఠా లోని బివాండి కోర్టుకు హాజరయ్యారు. ఆయనపై పరువు నష్టం చెల్లించాలని కోరుతూ కేసు దాఖలు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కేసులో భాగంగా కొత్త ష్యూరిటీకి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి రాహుల్ గాంధీ స్వయంగా హాజరు కావాలని న్యాయమూర్తి ప్రత్యేకంగా ఆదేశించారు . న్యాయమూర్తి ఆదేశాల మేరకు స్వయంగా వచ్చి ష్యూరిటీని సమర్పించారు. గ్యారెంటర్గా నిలిచిన మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ గత సంవత్సరం డిసెంబర్లో మరణించినందున, ఈ కేసులో కొత్త ష్యూరిటీని సమర్పించాలని భివాండి మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ ను ఆదేశించింది.
ఇదిలా ఉండగా 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా సోనాలే గ్రామంలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ హత్య వెనుక సంఘ్ హస్తం ఉందని పేర్కొన్నారని ఆరోపిస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త రాజేష్ కుంటే కోర్టులో ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై 2018 పరువు నష్టం కేసు విచారణ ఏప్రిల్ 12కి వాయిదా పడింది. ఆర్ఎస్ఎస్ ప్రతిష్టను దిగజార్చిందని కుంటే తన ఫిర్యాదులో భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 (పరువు నష్టం) కింద పేర్కొన్నారు. విచారణ సమయంలో కుంటే క్రాస్ ఎగ్జామినేషన్ , పునఃపరిశీలన ముగిసింది. తదుపరి విచారణ మొదట డిసెంబర్ 20, 2025కి షెడ్యూల్ చేయబడింది, కానీ కొత్త పూచీకత్తు అవసరం కారణంగా జనవరి 17కి వాయిదా వేయబడింది. జనవరి 17న, మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని ఫిబ్రవరి 21కి వాయిదా వేశారు.
