#StarMaaTelugu : తెలుగు లోగిళ్ళలో స్టార్ మా హవా

వినోద రంగంలో మాటీవి వినూత్నం

Star Maa Telugu : వినోదపు రంగంలో తనకంటూ ఓ బ్రాండ్ , ఇమేజ్ స్వంతం చేసుకున్న స్టార్ టీవీ ఆసియాలోనే కాదు ఇండియాను మెస్మరైజ్ చేస్తోంది. ఎక్కడ మార్కెట్ ఉంటుందో వ్యాపారులు, కంపెనీలు వెళ్లడం సహజం. కానీ అందరూ వెళ్లే దారిలో వెళితే మజా ఏముంటుంది. కిక్ అన్నది లేక పోతే ..మనకంటూ ఓ చరిత్ర అన్నది లేకపోతే ..ఉండీ ఏం ప్రయోజనం అని అంటారు..ఓ సందర్భంలో ఆ సంస్థ సీయివో ఉదయ్ శంకర్.

ఎప్పుడైతే స్టార్ గ్రూప్ అతడిని ఏరికోరి ఎంచుకుందో అప్పుడే గెలుపు అన్నది కంపల్సరీ అని డిసైడ్ అయి పోయింది. ఇంకేం చేరిన తక్షణమే స్టార్ టీవీ రూపు రేఖలను మార్చేశాడు. మొత్తం మార్కెట్ స్ట్రాటజీని భిన్నంగా అమలు చేస్తూ ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. డబ్బులు కొల్లగొట్టాలంటే బ్యాంకులనో , లేదా జనాలనో మోసం చేయాల్సిన పని లేదు. నిజాయితీగా సంపాదించ వచ్చని నిరూపించాడు.

అంతేనా ఇప్పుడు ఇండియన్ ఎంటర్టైన్ మెంట్ విభాగంలో ఉదయ్ ఓ సెన్సేషన్. ఒక్కసారి ద్రుష్టి సారిస్తే..ఇక అది కావాల్సిందే. అందుకే మొత్తం మార్కెట్ నే పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకు వచ్చాడు. కోట్లు కొల్లగొట్టాలంటే ఏం చేయాలో ఉదయ్ శంకర్ ను దగ్గరగా చూడాలి. ప్రాంతీయ భాషల్లోకి స్టార్ ఎంటర్ అయ్యింది. భిన్నమైన ప్రోగ్రామ్స్ , నేటివిటీకి దగ్గరగా ఉండటం. పాత్రల ఎంపికలో ప్రత్యేకత. వినోదం తో పాటు కుటుంబాల మధ్య నిరంతరం కొనసాగే బంధాలకు ప్రాణం పోస్తూ, మరింత ఉత్సుకతను పెంచేలా కార్యక్రమాలు రూపొందించారు.

ఇది కూడా వర్కౌట్ అయ్యింది స్టార్ టీవీకి(Star Maa Telugu). ఒకప్పుడు జీ తెలుగు , జెమిని , మా టీవీలు పోటీ పడుతూ రేటింగ్స్ లలో టాప్ లో ఉన్నాయి. కానీ ఇప్పుడు జీ తెలుగు తో మిగతా ఛానల్స్ స్టార్ మాతో పోటీ పడుతున్నాయి. స్టార్ ఊహించని రీతిలో మా టీవీని కొనుగోలు చేసింది. ఎంత డీల్ కుదిరింది అనేది ఇప్పటికి వెల్లడించలేదు. కానీ స్టార్ తీసుకున్నాక మా టీవీ మొత్తం స్వరూపమే మారి పోయింది.

మొదటగా నాగార్జునతో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం పాపులర్ అయ్యింది. దేశమంతటా బిగ్ బాస్ బిగ్ సక్సెస్ . దీంతో తమిళ్, తెలుగు ఛానళ్లలో స్టార్ స్టార్ట్ చేసింది. మొదట జూనియర్ ఎన్ఠీఆర్ చేయగా , రెండో సారి నాని యాంకర్ గా ఉన్నాడు. తాజాగా బిగ్ బాస్ ప్రోగ్రాం ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు.

అనుకోని రీతిలో స్టార్ (Star Maa Telugu )యాజమాన్యంకు భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ నగరంలోనే టాప్లో ఉండగా , రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారి లోగిళ్లలో స్టార్ మా టీవీ కార్యక్రమాలు పలకరిస్తున్నాయి. అంతే కాకుండా స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం సీరియల్ ..ముద్దా మందారం సీరియల్ ను దాటేసింది.

ఈ సీరియల్ పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అగ్నిసాక్షి, వదినమ్మ , ఇలా ప్రతి సీరియల్ దేనికదే రేటింగ్ ను అందుకుంటున్నాయి. స్టార్ మా టీవీకి కాసులు వచ్చేలా చేస్తున్నాయి. మొత్తం మీద నగరాలు కాదు పట్టణాలు, పల్లెల్లోకి స్టార్ మా టీవీ ఎంటర్ అయ్యింది. ఇదంతా ఉదయ్ శంకర్ మహిమే కాదంటారా ఎవరైనా. 

No comment allowed please