హైదరాబాద్ : నటి అనసూయ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు మరోసారి. సోషల్ మీడియాలో వ్యతిరేకత నేపథ్యంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేసి చూడటం లేదా నిందించడం లేదని అన్నారు. కేవలం వేధింపులు , వ్యక్తిగత దూషణల గురించే తాను మాట్లాడానని అనసూయ స్పష్టం చేశారు. హిందూ మతం , మతపరమైన నినాదాల దుర్వినియోగంపై ఇటీవల చేసిన వ్యాఖ్యల చుట్టూ చెలరేగిన వివాదంపై నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. తన వ్యాఖ్యలను సందర్భం నుండి వేరు చేసి, సనాతన ధర్మంపై దాడిగా చిత్రీకరించారని ఆమె పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్లో పెట్టిన సుదీర్ఘ పోస్ట్లో, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన మాటలను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని అనసూయ ఆరోపించారు.
ఆన్లైన్లో తనపై అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడే వారిని ఉద్దేశించి మాత్రమే తాను మాట్లాడానని, ఏ మతాన్ని లేదా వర్గాన్ని ఉద్దేశించి కాదని ఆమె స్పష్టం చేశారు. తాను ఆచరణాత్మక హిందువునని , హనుమంతుని భక్తురాలినని అనసూయ తెలిపారు. సనాతన ధర్మం నుండి తాను నేర్చుకున్న విలువల్లో సత్యం కోసం నిలబడటం, తప్పును ప్రశ్నించడం, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రజలను గౌరవించడం వంటివి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తనకు అన్యాయం జరుగుతోందని భావించినప్పుడు గళమెత్తేందుకు హనుమంతుని నుండి పొందే ధైర్యం, శక్తి తనకు స్ఫూర్తినిస్తాయని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎడిట్ చేసిన వీడియో క్లిప్లు లేదా పాక్షిక నిజాల ఆధారంగా అభిప్రాయాలను ఏర్పరచుకోవద్దని, బదులుగా తన వ్యాఖ్యల వెనుక ఉన్న పూర్తి సందర్భాన్ని అర్థం చేసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.
మతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేసి చూడటం లేదా నిందించడం లేదని అన్నారు అనసూయ భరద్వాజ్. కేవలం వేధింపులు, వ్యక్తిగత దూషణల గురించే తాను మాట్లాడానని మరోసారి నొక్కి చెప్పారు.నా విశ్వాసం పట్ల నాకు గర్వం ఉంది. నా సనాతన ధర్మం పట్ల నాకు గర్వం ఉంది. నన్ను నేను హిందువుగా చెప్పుకోవడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. అదే సమయంలో, మతంతో సంబంధం లేకుండా వేధింపులు వేధింపులే, అలాగే అగౌరవం అగౌరవమే అని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు.