YS Sharmila KCR : దేశాన్ని అమ్మేందుకేనా ఆఫ‌ర్

సీఎం కేసీఆర్ పై ష‌ర్మిల ఫైర్

YS Sharmila KCR : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ కేసీఆర్(CM KCR) అంత‌రంగాన్ని బ‌య‌ట పెట్టారు. త‌న‌ను గ‌నుక విపక్షాల కూట‌మికి చైర్మ‌న్ ను చేస్తే 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అయ్యే ఖ‌ర్చు తానే పెట్టుకుంటాన‌ని చెప్పారంటూ బాంబు పేల్చారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీశాయి.

దీనిపై స్పందించిన వైఎస్ ష‌ర్మిల(YS Sharmila KCR) భార‌త రాష్ట్ర స‌మితి పార్టీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్న‌ది కాకుండా ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా అంటూ ప్ర‌శ్నించారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్ర ఖ‌జానాను దోచుకున్నార‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి వేశార‌ని, పార్టీ ఫండ్ పేరుతో ఏకంగా రూ. 1,000 కోట్లు జ‌మ చేసుకున్న ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు.

ప్ర‌త్యేక విమానాలు, హెలికాప్ట‌ర్లు కొనుగోలు చేస్తున్న కేసీఆర్ కు ఇంత పెద్ద ఎత్తున డ‌బ్బులు ఎలా వ‌చ్చాయో, ఎవ‌రి ద్వారా స‌మ‌కూరాయో ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌. రాబోయే ఎన్నిక‌ల్లో ఏకంగా రూ. 20 వేల కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేస్తాన‌ని చెప్ప‌డం దొర అహంకారానికి, అవినీతికి ప‌రాకాష్ట అని పేర్కొన్నారు. ఒక‌ప్పుడు స్కూట‌ర్ లో తిరిగిన కేసీఆర్ కు ఇన్ని వేల కోట్లు ఎలా వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించారు ష‌ర్మిల‌.

Also Read : ఇంకెంత కాలం లీకుల ప‌ర్వం

Leave A Reply

Your Email Id will not be published!