Yuva Galam Nava Shakam : యువ గ‌ళం న‌వ శ‌కం స‌భ‌

ఒకే వేదిక‌పై బాబు..ప‌వ‌న్..లోకేష్

Yuva Galam : పోలేప‌ల్లి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేష్ యువ గ‌ళం(Yuva Galam) న‌వ శ‌కం స‌భ‌కు స‌ర్వం సిద్ద‌మైంది. ఒకే వేదిక‌పై కీల‌క‌మైన నేత‌లు కొలువు తీర‌నున్నారు. ఇప్ప‌టికే స‌భను నిర్వ‌హించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది తెలుగుదేశం పార్టీ.

Yuva Galam Nava Shakam Viral

ఈ స‌భ‌కు టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తో పాటు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వన్ క‌ళ్యాణ్ హాజ‌రు కానున్నారు. దీంతో అంద‌రి దృష్టి ఈ స‌భ‌పై ప‌డింది. మ‌రో వైపు వైసీపీ వీరిని లైట్ గా తీసుకుంది.

స‌భ ప్రాంగ‌ణ ఏర్పాట్ల‌ను టీడీపీ చీఫ్ కింజార‌పు అచ్చెన్నాయుడుతో పాటు మాజీ మంత్రులు సైతం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వేలాది మంది త‌ర‌లి రానున్నారు. రాత్రి వ‌ర‌కు ఈ స‌భ జ‌ర‌గ‌నుంది. పోలేప‌ల్లి వ‌ద్ద దీనిని ఏర్పాటు చేశారు.

రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి ప్ర‌జ‌లు చేరుకుంటున్నారు. స‌భ కోసం ప్ర‌త్యేకంగా తెలుగుదేశం పార్టీ 5 ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ బ‌స్సులు, లారీలు, కార్లు, ఇత‌ర వాహ‌నాలలో టీడీపీ శ్రేణులు చేరుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే విశాఖ‌కు చేరుకున్నారు రాష్ట్ర‌, జాతీయ స్థాయి మీడియా ప్ర‌తినిధులు.

Also Read : TTD Chairman Bhumana : 23 నుంచి వైకుంఠ ద‌ర్శ‌నం

Leave A Reply

Your Email Id will not be published!