Nagarjuna Akkineni : వాళ్లిద్ద‌రూ విడిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం

నాగ చైత‌న్య స‌మంతపై నాగార్జున

Nagarjuna Akkineni :  చాలా రోజుల త‌ర్వాత టాలీవుడ్ న‌టుడు అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni)  స్పందించారు. ఎక్క‌డ కూడా ఎలాంటి కామెంట్స్ చేయ‌ని ఆయ‌న ఇవాళ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

త‌న త‌న‌యుడు నాగ చైత‌న్య‌, మాజీ కోడ‌లు న‌టి స‌మంత రుత్ ప్ర‌భు విడాకులు తీసుకోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. వారిద్ద‌రూ క‌లిసి మొద‌ట‌గా గౌతం వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఏం మాయ చేసావే మూవీలో న‌టించారు.

ఆనాటి నుంచి ప్రేమ‌లో పడ్డారు. పెళ్లి కూడా చేసుకున్నారు. త‌ర్వాత ఎందుక‌నో విడి పోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీని వెనుక ఎవ‌రిది త‌ప్పు అనే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ కూడా జ‌రిగింది.

ఇదిలా ఉండ‌గా చైతు, స‌మంత విడి పోయిన నెల‌ల త‌ర్వాత నాగార్జున(Nagarjuna Akkineni)  నోరు విప్ప‌డం విస్తు పోయేలా చేసింది సినీ రంగాన్ని. ఈ ఇద్ద‌రు గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో తాము విడి పోతున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు.

చైత‌న్య‌కు ఇది దుర‌దృష్ట‌క‌ర‌మైన అనుభ‌వ‌మ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా స‌మంత ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ త‌మ మార్గాల‌లో స్వేచ్ఛ‌గా ఉండేందుకు విడిగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపింది.

ఒక ద‌శాబ్దానికి పైగా స్నేహం క‌లిగి ఉన్నందుకు మేం అదృష్టవంతుల‌మ‌ని కూడా స్ప‌ష్టం చేసింది స‌మంత రుతు ప్ర‌భు. ఇదిలా ఉండ‌గా ఆమె ఇటీవ‌ల న‌టించిన పుష్ప మూవీలోని సాంగ్ దుమ్ము రేపింది.

ఊ అంటావా మామ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీంతో స‌మంత పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.

Also Read : ఏ మాయ చేసావే మూవీ సీక్వెల్

Leave A Reply

Your Email Id will not be published!