Shashi Tharoor : పార్ల‌మెంట్ ను ర‌బ్బ‌ర్ స్టాంప్ గా మార్చేశారు

కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ షాకింగ్ కామెంట్స్

Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ‌కుడు , ఎంపీ శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌ని మండిప‌డ్డారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌జా దేవాల‌యంగా భావించే పార్ల‌మెంట్ (లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌) ను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతే కాదు పార్ల‌మెంట్ ను నోటీసు బోర్డుగా, అంత‌కంటే ఎక్కువ‌గా కేవ‌లం ర‌బ్బ‌ర్ స్టాంప్ గా మార్చేశారంటూ మోడీపై నిప్పులు చెరిగారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor).

గ‌తంలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించే వార‌ని, కానీ ఇవాళ దేశంలో అప్ర‌కటిత ఎమ‌ర్జెన్సీ కాలం న‌డుస్తోంద‌ని ఆరోపించారు ఎంపీ. రాజ‌స్థాన్ లోని జైపూర్ లో జ‌రిగిన జైపూర్ సాహిత్య పండుగ ( లిటరేచ‌ర్ ఫెస్టివ‌ల్ ) లో శ‌శి థ‌రూర్(Shashi Tharoor) పాల్గొని ప్ర‌సంగించారు. సుస్థిర ప్ర‌జాస్వామ్యం, ప్ర‌జాస్వామ్యాన్ని పెంపొందించ‌డం అనే సెష‌న్ లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ. సిద్దిక్ క‌ప్ప‌న్ వంటి వారిని బెయిల్ లేకుండా రెండేళ్ల పాటు జైళ్లో ఉంచిన ఘ‌న‌త న‌రేంద్ర మోడీ బీజేపీ స‌ర్కార్ కు ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు.

ఇప్ప‌టికే క‌ఠిన‌మైన చ‌ట్ట విరుద్ద కార్యక‌లాపాల నివార‌ణ చ‌ట్టం (యుఏపీఏ) ను క‌ఠిన‌త‌రం చేయ‌డం అనేక మార్గాల‌లో ఒక‌టి అని పేర్కొన్నారు శ‌శి థ‌రూర్. ప్ర‌స్తుత స‌ర్కార్ రాజ్యాంగ ప్ర‌జాస్వామ్య స్పూర్తి నుండి వైదొలిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విచిత్రం ఏమిటంటే క‌ప్ప‌న్ కు పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోపిస్తూ అరెస్ట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

Also Read : హాత్ సే హాత్ జోడో లోగో విడుద‌ల

Leave A Reply

Your Email Id will not be published!