Akhilesh Yadav Modi : మోదీ పాలనలో దేశం వెనక్కి – అఖిలేష్
సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఫైర్
Akhilesh Yadav Modi : సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో దేశం అభివృద్దిలో వెనక్కి పోయిందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ధనవంతుల కోసం పని చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలకు ద్రవ్యోల్బణం, ద్వేష పూరిత రాజకీయాలు మాత్రమే ఇచ్చిందని అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆరోపించారు.
2024 ఎన్నికల్లో ఢిల్లీ నుంచి బీజేపీని, నరేంద్ర మోదీని ప్రజలు తరిమికొట్టే రోజు తప్పక వస్తుందన్నారు . ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో సోమవారం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిందని మండిపడ్డారు. పేదరికం, నిరుద్యోగం, ఆకలి, ద్రవ్యోల్బణంతో పాటు సామాన్య ప్రజానీకానికి బీజేపీ విద్వేషాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
కేవలం వ్యాపారవేత్తలు, ధనవంతులు, కార్పొరేట్లు, సంస్థలకు వత్తాసు పలుకుతూ దేశాన్ని లూటీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా దేశం వెనక్కి వెళ్లిందన్నారు అఖిలేష్ యాదవ్.
ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు 10 వేల పోస్టులు భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు ఎస్పీ చీఫ్. దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా ఏళ్లుగా వెనుకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని మొత్తం 80స్థానాల్లో బీజేపీకి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav).
Also Read : మోడీజీ లడఖ్ ను రక్షించండి