Dharmana Prasada Rao : ధర్మాన షాకింగ్ కామెంట్స్
కార్యకర్తలు చితికి పోయారన్న మంత్రి
Dharmana Prasada Rao : ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏది మాట్లాడినా అది సంచలనమే. దాని వెనకాల ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి. కేబినెట్ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీకి చెందిన కార్యకర్తలు చితికి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ధర్మాన ప్రసాదరావు. పార్టీ కోసం, కార్యక్రమాల కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారని కొనియాడారు.
ఎక్కడి నుంచో వస్తున్న డబ్బుల నుంచి ఖర్చు పెట్టడం లేదని పేర్కొన్నారు ఏపీ మంత్రి. అయితే కేవలం ప్రజల కోసం పని చేస్తున్నారని, వారికి మెరుగైన పాలన అందించే ఉద్దేశంతో కార్యకర్తలు శ్రమకోర్చి పని చేస్తున్నారంటూ ధర్మాన కితాబు ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఆయన మంచి కోసం కామెంట్స్ చేసినా అవి ఒక్కోసారి వైసీపీ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించేలా చేస్తున్నాయి. గత నాలుగు సంవత్సరాల కాలం నుంచి పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు బాగు కోసం పని చేస్తూ వచ్చారు. చాలా మంది చితికి పోయారు. తాను దీనిని తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao).
అయితే వారికి పైసా కూడా లబ్ది చేకూరడం లేదన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను బెదిరించేవంటూ నిప్పులు చెరిగారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
Also Read : Justice Madan Lokur : రెజ్లర్లపై ఖాకీల దాడులు దారుణం – లోకూర్