Gunturu Kaaram Update : గుంటూరు కారం అప్ డేట్ – త్రివిక్ర‌మ్

ట్విట్ట‌ర్ వేదిక‌గా ద‌ర్శ‌కుడు వెల్ల‌డి

Gunturu Kaaram Update : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రిన్స్ ఫ్యాన్స్ కు తీపిక‌బురు చెప్పారు. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న గుంటూరు కారం చిత్రానికి ఎస్. రాధాకృష్ణ నిర్మాత‌.

Gunturu Kaaram Update From Director

మ‌హేష్ బాబు , మీనాక్షి చౌద‌రి, శ్రీలీల , జగపతిబాబు న‌టిస్తున్నారు. మ‌నోజ్ ప‌ర‌మ హంస సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ స‌మ‌ర్పిస్తోంది ఈ చిత్రాన్ని. షూటింగ్ శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. మ‌రో వైపు గుంటూరు కారంపై రోజుకో న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తోంది(Gunturu Karam Updates). సినిమా నుంచి ఇప్ప‌టికే పూజా హెగ్డే విర‌మించు కుంద‌ని టాక్. చివ‌ర‌కు ఎవ‌రు ఉంటారో ఎవ‌రు ఉండ‌రో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ప్ర‌త్యేకించి త‌ను కంఫ‌ర్ట్ జోన్ లో లేక పోవ‌డం వ‌ల్ల‌నే ఆమె త‌ప్పుకుంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో గుంటూరు కారం చిత్రాన్ని తెర కెక్కించే ప‌నిలో ప‌డ్డారు త్రివిక్రమ్ శ్రీ‌నివాస్. ఇక ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు న‌టిస్తున్న మూడో చిత్రం కావ‌డం విశేషం. అంత‌కు ముందు ఆయ‌న అత‌డు, ఖ‌లేజా లో న‌టించాడు. రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచాయి.

Also Read : Minister KTR : దేశానికే తెలంగాణ రోల్ మోడ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!