YS Jagan : తిరుమల నెయ్యి కల్తీ వివాదంపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి

శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన జగన్....

YS Jagan : తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండించారు. ఒక సీఎం ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని నిలదీశారు.

YS Jagan Comment

శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన జగన్.. తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు వంద రోజుల తరువాత ఎందుకు బయటకొచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. దశాబ్దాలుగా లడ్డూ తయారీ విధానంలో ఒకే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

Also Read : Amit Shah: 2026 మార్చి నాటికి మావోయిస్టులు అంతం చేస్తాం – హోంమంత్రి అమిత్‌ షా

Leave A Reply

Your Email Id will not be published!