MLC Kavitha: కుల గణన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
కుల గణన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
MLC Kavitha : కాంగ్రెస్ చేసిన కులసర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి… ఓసీల జనాభాను పెంచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం అని తేలిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. అయితే రేవంత్ ప్రభుత్వం మాత్రం బీసీ జనాభా తగ్గించి… ఓసీ జనాభాను పెంచారని ఆమె మండిపడ్డారు. గ్రామాల వారీగా… కులాల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి , యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో శనివారం నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… బీసీల బిల్లులను కేంద్రం ప్రభుత్వం ఆమోదించేలా బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం కూడా ప్రకటన చేయాలని కోరారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలని అన్నారు. ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అన్నారు. ఇంత వరకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ తమ పోరాటం వల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చట్టాలు చేసిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.
MLC Kavitha – బీఆర్ఎస్ హయాంలో బీసీలకు పెద్దపీట
పదేళ్ల బీఆర్ఎస్(BRS) హయాంలో బీసీలకు లక్షా 55 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కులవృత్తులను బలోపేతం చేస్తుంటే కొంతమంది ఎగతాళి చేశారని అన్నారు. కానీ గత 15 నెలలుగా కులవృత్తులు ఏ విధంగా కుదేలయ్యాయో చూస్తున్నామని చెప్పారు. బీసీ నాయకత్వం బలపడడానికి ఐదుగురిని రాజ్యసభకు, 8 మందికి ఎమ్మెల్సీ, 58 మందికి కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని ఉద్ఘాటించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పదవి ఎప్పడూ బీసీలకు దక్కలేదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మొట్టమొదటి సారిగా రవీందర్ యాదవ్ను కేసీఆర్ వీసీగా నియమించారని చెప్పారు. అడ్వకేట్ జనరల్గా బీసీ బిడ్డ అయిన ప్రసాద్ను నియమించిన ఘనత కేసీఆర్దని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిందని… దాంతో తెలంగాణలో రిజర్వేషన్లు 54 శాతం అమలవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో 50 శాతం పరిమితి మించింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేశామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
Also Read : MLA Mallareddy: మరోవివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి