AP DSC: ఏపీలో యథావిధిగా డీఎస్సీ షెడ్యూల్‌ – సుప్రీంకోర్టు

ఏపీలో యథావిధిగా డీఎస్సీ షెడ్యూల్‌ - సుప్రీంకోర్టు

AP DSC : ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ, టెట్‌ కు లైన్‌ క్లియర్‌ అయింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టులోనే పిటిషన్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం సూచించింది. టెట్‌, డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది.

AP DSC Schedule

ఏపీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్‌ 20న నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూన్‌ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్ లైన్ లో మాక్ టెస్ట్ లను అవకాశం కల్పించారు. త్వరలో సీబీటీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు… అభ్యర్ధులకు భారీ ఉపసమనం కలిగించిందని చెప్పాలి.

Also Read : MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లేఖపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్, బీజేపీ

Leave A Reply

Your Email Id will not be published!