చెన్నై : తమిళనాడులో క్రికెట్ ఫీవర్ అలుముకుంది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది రాష్ట్ర రాజధాని చెన్నై లోని స్టేడియం. ఇదిలా ఉండగా సూపర్ -8లో భాగంగా భారత జట్టు జింబాబ్వేతో ఆడనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లలో గెలిచిన భారత్ మరో కీలకమైన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో 67 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రన్ రేట్ పరంగా కిందికి పడి పోయింది. ఇక అనూహ్యంగా సఫారీలు దుమ్ము రేపుతున్నారు. అభిషేక్ శర్మతో పాటు మరికొందరు ప్లేయర్లు ఆశించిన మేర ఆడలేక పోతున్నారంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్.
మరో వైపు తాజా సమాచారం ప్రకారం జట్టు ఓవరాల్ ప్రదర్శన పట్ల కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకపక్ష ఓటమి తర్వాత, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ , కొంతమంది సీనియర్ ఆటగాళ్లను మందలించినట్లు వార్తలు వస్తున్నాయి. అతిపెద్ద సమస్య ఓటమి మాత్రమే కాదు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాధ్యత, ఉద్దేశ్యం లేకపోవడం. స్పష్టమైన విధానం లేదు, ఒత్తిడిలో ప్రశాంతత లేకుండా ఉండడం, జట్టుకు అవసరమైనప్పుడు బాధ్యత వహించడానికి ఎవరూ సిద్ధంగా లేరు . ప్రస్తుతం, జట్టు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది . 2026 T20 ప్రపంచ కప్ నుండి నిష్క్రమించే ప్రమాదం ఉన్నందున, శిబిరంలో ఆందోళనలు పెరుగుతున్నాయి.మరో వైపు తుది జట్టులో స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఉంటాడా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇంకో వైపు అభిషేక్ శర్మను తప్పించి తనను తీసుకుంటారా లేక అలాంటి పాత జట్టునే కంటిన్యూ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
