రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ రియాన్ పరాగ్ పై వేటు
డ్రెస్సింగ్ రూమ్లో అతడు ఈ-సిగరెట్ తాగిన కెప్టెన్
రాజస్తాన్ : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ మెరుగైన ఆటతీరు కనబరుస్తున్నప్పటికీ ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ దుందుడుకు స్వభావం కారణంగా పలు చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా తను సంచలనంగా మారాడు. ఇందుకు కారణం ముల్లాన్ పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష ప్రసార టీవీలో స్పష్టంగా కనిపించిన ఈ చర్య, భారత చట్టాలను, స్టేడియం నిబంధనలను ఉల్లంఘించేదిగా ఉంద. దీనివల్ల పరాగ్ కు జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
కాగా రియాన్ పరాగ్ నిర్వాకంపై సీరియస్ గా స్పందించింది బీసీసీఐ. సదరు క్రికెటర్ నుండి వివరణ కోరామని తెలిపింది. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ రూల్స్ ప్రకారం మొదటిసారి చేసిన నేరానికి రియాన్ పరాగ్ కు ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ. లక్ష జరిమానా ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత చట్టాల ప్రకారం ‘వేపింగ్’ చేయడం చట్టవిరుద్ధం. దీంతో తనకు శిక్ష తప్పదని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. చాలా మంది ఆటగాళ్లు e-సిగరెట్లు వాడుతుంటారు, కానీ వారు వాటిని డ్రెస్సింగ్ రూమ్లో తాగరు. చుట్టూ ఇన్ని కెమెరాలు ఉన్నప్పుడు అలా చేయడం చాలా ప్రమాదకరం. పరాగ్ బహిరంగంగా చేశాడు. తనకు తప్పకుండా శిక్ష పడటం ఖాయం అంటున్నారు మాజీ క్రికెటర్లు.
