హైదరాబాద్ : ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏది ఎప్పుడు జరుగుతుందో, ఏం జరుగుతుందో చెప్పలేమని పేర్కొన్నాడు. ఇదే సమయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏది సక్సెస్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరని, తాను కూడా ఇందుకు మినహాయింపు కాదన్నాడు రానా దగ్గుబాటి. దీని గురించి తాను ఆలోచించడం మానేశానని పేర్కొన్నాడు. ఏది క్లిక్ అవుతుందో అని విశ్లేషించు కోవడం లేదన్నాడు. దానికి ప్రయారిటీ ఇవ్వడం లేదన్నాడు . దానికి బదులుగా తనను ఆశ్చర్యపరిచే కథలకు, తాను నమ్మే చిత్ర నిర్మాతలకు , ఏదైనా సందేశాన్ని లేదా ప్రత్యేకతను కలిగి ఉన్న చిత్రాలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపాడు. తాను ప్రారంభించిన సంస్థ ‘స్పిరిట్ మీడియా’ విభిన్నమైన సంప్రదాయాలకు భిన్నమైన ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఏది విజయం సాధిస్తుందో అంచనా వేయడంపై పరిశ్రమ దృష్టి సారిస్తున్న తరుణంలో, రానా దగ్గుబాటి మాత్రం ఆ వ్యాపార కోణాన్ని అంచనా వేయడం మానేశానని చెబుతున్నారు.
ఆయన దృష్టిలో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథలను, భిన్నమైన దృక్పథం ఉన్న చిత్ర నిర్మాతలను కనుగొనడమే ఇప్పుడు ఆసక్తికరమైన సవాలు. వ్యాపారానికి కాగితంపై లెక్కించగలిగే ఒక తర్కం ఉంటుందన్నాడు. కానీ కళకు అలా ఉండదు. మీరు అన్నీ సరిగ్గా చేసినా అది ప్రేక్షకులకు చేరక పోవచ్చు; అలాగే ఆ సమయంలో ఎవరికీ అర్థం కాని పని చేసినా, అది ముప్పై ఏళ్లపాటు ప్రజల మనసుల్లో నిలిచి పోవచ్చని పేర్కొన్నారు రానా దగ్గుబాటి. దీనికి నిర్దిష్టమైన సూత్రం అంటూ ఏమీ లేదు, ఎవరైనా తమ దగ్గర అలాంటి సూత్రం ఉందని చెబితే, వారు ఏదో అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. అందుకే నేను దీన్ని అంచనా వేయడం మానేశానని నొక్కి చెప్పాడు. నాకు ఆసక్తికరంగా అనిపించిన వాటికి, నేను కలిసి పని చేయాలనుకునే వ్యక్తులతో కలిసి మద్దతు ఇస్తానని చెప్పాడు రానా దగ్గుబాటి. కొన్ని విజయవంతం అవుతాయి, కొన్ని కాకపోవచ్చు. విజయాల కంటే వైఫల్యాలే నాకు ఎక్కువ పాఠాలు నేర్పాయి అని అరవింద్ అడిగా రాసిన పుస్తకం తనను ఆకట్టుకుందన్నాడు.
