BJP Leaders Tour: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు !
తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు !
BJP Leaders Tour: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ… తెలంగాణాలో తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో సభలు, రోడ్డు షోలో పాల్గొనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై గెలుపే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు ఈ సభలు, సమావేశాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు తెలంగాణా బీజేపీ నాయకత్వం పక్కా ప్రణాళికలు రచించింది.
BJP Leaders Tour Updates
ఏప్రిల్ 29వ తేదీన జేపీ నడ్డా… కొత్తగూడెం, మహబూబాబాద్ లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసగించనున్నారు. అలాగే అదే రోజు… హైదరాబాద్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించ నున్నారు. ఇక ఏప్రిల్ 30వ తేదీన ఆందోల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు.
మే 1వ తేదీన తెలంగాణకు అమిత్ షా రానున్నారు. పాతబస్తీలోని ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్ లోని లాల్దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి శాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు.
Also Read : YS Sharmila: సీఎం జగన్ కు షర్మిల బహిరంగ లేఖ